Chandrababu: గవర్నర్ తో చంద్రబాబు భేటీ... వైసీపీపై ఫిర్యాదులు

  • గవర్నర్ కు 14 పేజీల లేఖ సమర్పించిన చంద్రబాబు
  • ఏడాదిగా జరుగుతున్న ఘటనలపై గవర్నర్ కు వివరణ
  • రక్షణ లేకుండా పోయిందని ఆవేదన
Chandrababu met AP Governor and complained against YSRCP

రాష్ట్రంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అరెస్టులు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సాయంత్రం గవర్నర్ ను కలిసిన చంద్రబాబు ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారు.

కేవలం 4 రోజుల వ్యవధిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ కు 14 పేజీలతో సుదీర్ఘ లేఖ సమర్పించారు. సంవత్సరకాలంలో 800 మంది టీడీపీ కార్యకర్తలు దాడులకు గురయ్యారని, వైసీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు.

More Telugu News