Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • పారితోషికం తగ్గించుకుంటున్న కీర్తి సురేశ్ 
  • త్వరలో 'పుష్ప' షెడ్యూల్ ప్రారంభం
  • ఆగస్టు నుంచి షూటింగులకి నితిన్
Kerrthi Suresh to slash her remuneration

*  అందాలభామ కీర్తి సురేశ్ తన పారితోషికాన్ని తగ్గించుకోనున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ వల్ల సినిమా రంగానికి కూడా అపార నష్టం వాటిల్లిన నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ తన రాబోయే చిత్రాల విషయంలో పారితోషికాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకుందట.
*  అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప' చిత్రం షూటింగును ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో వేస్తున్న భారీ సెట్స్ లో ఈ చిత్రం షూటింగును త్వరలో ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది.
*  యంగ్ హీరో నితిన్ ఆగస్టు నుంచి షూటింగులలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగ్ దే' చిత్రం షూటింగులో ఆగస్టులో జాయిన్ అవుతాడట.

More Telugu News