Vijay Sai Reddy: నిమ్మగడ్డ కోసం రెండు డజన్ల మంది అడ్వొకేట్లను దింపాడు: బాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

  • నిమ్మగడ్డ అంశంపై రగడ
  • సర్కారు విధానపరమైన నిర్ణయం తీసుకుందన్న విజయసాయి
  • బాబు ఎందుకు హైరానా పడుతున్నాడో అంటూ ట్వీట్
Vijayasai Reddy comments on Nimmagadda issue

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. నిమ్మగడ్డ ఎస్ఈసీగా మళ్లీ బాధ్యతలు చేపట్టడంపై స్పష్టతలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు.

'నిమ్మగడ్డ లాంటి వ్యక్తి SECగా ఉంటే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయదని ప్రజలనుకుంటున్నారు. ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఆయన పదవి నుంచి దిగిపోయాడని బాబు రెండు డజన్ల మంది అడ్వొకేట్లను రంగంలోకి దింపాడు. నిమ్మగడ్డ కోసం ఆయనెందుకు హైరానా పడుతున్నా డో?' అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

More Telugu News