Andhra Pradesh: ప్రేమ జంటకు మద్దతుగా నిలిచిన యువకుడిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి!

  • కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఘటన
  • ఓ యువతి, యువకుడు ప్రేమాయణం
  • ప్రేమజంటకు మద్దతు పలికిన ప్రవీణ్‌ కుమార్ ‌
youngster killed by a girl family

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం గూబగుండంమెట్ట వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి, యువకుడు ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వారి ప్రేమకు పెద్దలు అడ్డు చెబుతుండడంతో ప్రవీణ్‌ కుమార్‌ అనే యువకుడు ఆ ప్రేమ జంటకు మద్దతుగా నిలిచాడు. వారి ప్రేమకు అతడు సహకరిస్తూ ఉండడంతో యువతి కుటుంబ సభ్యులు అతడిపై కోపం పెంచుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆ యువతి బంధువులు ప్రవీణ్ కుమార్‌పై దాడి చేశారు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రవీణ్‌ ప్రాణాలు విడిచాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News