Narendra Modi: ‘కొవిడ్-19’ పై ఇండోనేషియా అధ్యక్షుడితో చర్చించిన ప్రధాని మోదీ

  • ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో  
  • ఈ సంక్షోభంతో ఆర్థిక, ఆరోగ్య అంశాలపై సవాళ్లు  
  • ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం ముఖ్యమన్న మోదీ
Narendra Modi discussed with Indonesia president joco widodo

‘కొవిడ్-19’ మహమ్మారి గురించి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో భారత ప్రధాని మోదీ చర్చించారు. ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ మహమ్మారిపై మంచి మిత్రుడు జోకో విడోడోతో చర్చించానని పేర్కొన్నారు. సాగరానికి ఇరుగుపొరుగు వాళ్లంగా, సమగ్ర వ్యూహాత్మక భాగస్వాములుగా.. ఈ సంక్షోభం కారణంగా తలెత్తిన ఆర్థిక, ఆరోగ్య అంశాలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇరు దేశాల మధ్య  సన్నిహిత సహకారం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

More Telugu News