Kalva Srinivasulu: శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి: టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు డిమాండ్

  • శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు
  • అందువల్లే, అక్కడ వైరస్ వ్యాప్తి చెందింది
  • ‘కరోనా’ వ్యాప్తి నివారణకు జగన్ తన చిత్తశుద్ధి చాటుకోవాలి
TDP Leader Kalva Srinivasulu Demands to arrest srikalahasti MLA

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కాళహస్తిలో ర్యాలీ నిర్వహించిన ఆ ఎమ్మెల్యే వల్లనే అక్కడ  కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు సీఎం జగన్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సూచించారు.

 నేను ఎటువంటి ర్యాలీ నిర్వహించలేదు: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఖండించారు. తాను ఎటువంటి ర్యాలీని నిర్వహించలేదని స్పష్టం చేశారు. తప్పు చేస్తే కనుక తనను అరెస్ట్ చేయవచ్చని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో దాక్కున్న బాబు దుష్ప్రచారం చేస్తున్నారని  ధ్వజమెత్తారు.

More Telugu News