Naveen Polishetty: 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ'కి సీక్వెల్ వుంది: హీరో నవీన్ పోలిశెట్టి

  • కథపై ఎక్కువ కసరత్తు చేస్తాను
  • రాజీ పడకపోవడం వల్లనే గ్యాప్
  • 'జాతి రత్నాలు' నవ్విస్తుందన్న నవీన్
Jathi Rathnalu Movie

కొంతకాలం క్రితం వచ్చిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' .. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. హీరోగా నవీన్ పోలిశెట్టికి ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తరువాత ఆయన నుంచి ఇంతవరకూ  సినిమా రాలేదు.

ఆ విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " కథలు నచ్చకపోవడమే ఇలా గ్యాప్ రావడానికి కారణం. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ప్రేక్షకులకు నచ్చడానికి కారణం, ఆ కథపై నేను చాలా కాలం పాటు కసరత్తు చేయడమే. కథలోని కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అందువల్లనే ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని భావిస్తున్నాను. అయితే సీక్వెల్ కి శ్రీకారం ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం అప్పుడే చెప్పలేను. నా తాజా చిత్రంగా 'జాతి రత్నాలు' రూపొందుతోంది. నాన్ స్టాప్ గా నవ్వించే ఈ సినిమా, నాకు మరో హిట్ ఇస్తుందనే నమ్మకంతో వున్నాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News