Pruthviraj Sukumaran: మలయాళ హిట్ మూవీ రీమేక్ .. ఆ ఇద్దరు దర్శకులలో ఒకరికి ఛాన్స్

  • సితార వారి చేతికి రీమేక్ హక్కులు
  • తెరపైకి బాలకృష్ణ - రానా పేర్లు
  • త్వరలోనే రానున్న స్పష్టత
Ayyappanum Koshiyum Movie

మలయాళంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' భారీ విజయాన్ని సాధించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ .. బిజూ మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, వైవిధ్యభరితమైనదిగా ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు దక్కించుకున్నారు. ఒక కోటి ఐదు లక్షలకు డీల్ కుదిరినట్టుగా సమాచారం.

ఇక హిందీ రీమేక్ రైట్స్ ను కూడా వీరే కొనుగోలు చేసే ఆవకాశం వున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు ఎవరికి  అప్పగించే అవకాశం ఉందనే ప్రశ్నకి సమాధానంగా సుధీర్ వర్మ - గౌతమ్ తిన్ననూరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరు దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రధాన పాత్రలకిగాను బాలకృష్ణ - రానా పేర్లు  వినిపిస్తున్నాయి.

More Telugu News