కొవిడ్-19పై రూమర్లకు కేంద్రం చెక్.. డ్యాష్‌బోర్డు అందుబాటులోకి!

Center Check for Rumors on Kovid19 Now Dashboard Available
  • అధికారికంగా డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
  • ప్రతీ నాలుగు గంటలకోసారి అప్‌డేట్ 
  • కోవిడ్ కేసులపై గందరగోళానికి తెర
దేశంలో కొవిడ్-19 మరణాలు, కేసులకు సంబంధించి వస్తున్న పొంతనలేని వార్తలకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇందులో భాగంగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కోవిడ్19ఇండియా.ఓఆర్‌జీ (www.covid19india.org) పేరుతో అధికారికంగా ఓ డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి ఏ రాష్ట్రంలో ఎలా ఉంది.. ఎక్కడ ఎంతమంది మరణించారు అన్న విషయాలపై వాస్తవ గణాంకాలను ఇందులో పొందుపరచనుంది. ప్రతీ నాలుగు గంటలకు ఒకసారి అప్పటి సమాచారం ప్రకారం దీనిని అప్‌డేట్ చేయనుంది.

ఈ డ్యాష్‌బోర్డు ప్రకారం.. రాత్రి పదిగంటల సమయానికి దేశంలో 645 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. వీటిలో 591 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 43 మంది కోలుకున్నారు. 11 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు 8 కేసులు నమోదు కాగా, ఒకరు రికవర్ అవగా, ఏడు యాక్టివ్‌గా ఉన్నాయి. తెలంగాణలో 39 కేసులు నమోదు కాగా, 38 యాక్టివ్‌గా ఉన్నాయి. ఒకరు కోలుకోగా, ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.
Go Back to Shorts
Dashboard
India
COVID-19

More Telugu News