Akhil: నిర్మాతగా నితిన్ .. పారితోషికం తీసుకోకుండా చేయనున్న అఖిల్?

  • విడుదలకి సిద్ధంగా అఖిల్ 4వ సినిమా 
  • 5వ సినిమాకి సన్నాహాలు
  • దర్శకుడిగా సురేందర్ రెడ్డి
Surendar Reddy Movie

అఖిల్ తాజా చిత్రంగా రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో అఖిల్ ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా నితిన్ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది.

అఖిల్ మొదటి సినిమాను వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వలన నితిన్ 25 కోట్ల వరకూ నష్టపోయాడు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికిగాను పారితోషికం తీసుకోకుండా ఆయన బ్యానర్లో మరో సినిమాను చేయాలనే నిర్ణయానికి అఖిల్ వచ్చాడట. అందువలన తన ఐదవ సినిమా చేసే ఛాన్స్ ను నితిన్ కి ఇచ్చాడని అంటున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాను ఓ మాదిరి బడ్జెట్ లోనే నిర్మించే ఆలోచనలో నితిన్ వున్నాడని అంటున్నారు.

More Telugu News