Guntur District: విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొన్న లారీ.. ఆరు బయట నిద్రిస్తోన్న దంపతులపై పడిన స్తంభం.. భర్త మృతి

  • గుంటూరు జిల్లా గురజాలలోని గంగవరంలో ప్రమాదం
  • బీభత్సం సృష్టించిన లారీ 
  • మహిళకు తీవ్రగాయాలు 

గుంటూరు జిల్లా గురజాలలోని గంగవరంలో ఈ రోజు ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. గంగవరం మీదుగా వెళ్తున్న ఆ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో అది కూలి పడిపోయింది.

దీంతో ఆరు బయట నిద్రిస్తోన్న దంపతులపై విద్యుత్‌ స్తంభం పడింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భార్యకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. లారీ డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విద్యుత్‌ స్తంభ వైర్లను సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

More Telugu News