Nikhil: 'కార్తికేయ 2'లో కలర్స్ స్వాతి వుందట!

  • గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
  • సెట్స్ పైకి వెళ్లిన సీక్వెల్ 
  •  దసరాకి రిలీజ్ చేసే ఆలోచన
Karthikeya 2 Movie

హీరో నిఖిల్ .. దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని దక్కించుకుంది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఈ ఇద్దరూ రంగంలోకి దిగారు. మొదటి భాగంలో నిఖిల్ జోడీగా కలర్స్ స్వాతి కనిపించింది. ఆమె నటన ఆ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందువలన రెండవ భాగంలో ఆమె ఉందా? .. లేదా? అనే సందేహం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

తాజాగా నిఖిల్ మాట్లాడుతూ .. కలర్స్ స్వాతి పాత్రకి కొనసాగింపు ఉందనీ, ఆ పాత్రలో ఆమే నటిస్తుందని స్పష్టం చేశాడు. అంతేకాదు .. ఈ సినిమాలో మరో కథానాయిక కూడా ఉంటుందనీ, ఆమెను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పాడు. ఆ అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ .. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

More Telugu News