Chandrababu: మాచర్ల దాడి ఘటనపై ఏపీ డీజీపీకి, ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖలు

Chandrababu Naidu writes letters to Ap DGP and Election commission
షార్ట్స్‌లో చూడండి
మాచర్ల దాడి ఘటనపై ఏపీ డీజీపీకి, ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖలు రాశారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై హత్యాయత్నం జరిగిందని, శాంతిభద్రతలు సరిగా లేనందువల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వైసీపీ దాడుల నియంత్రణకు ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా  టీడీపీ నేతలకు తగిన భద్రత కల్పించాలని కోరారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Macherla incident
DGP
State Election commission

More Telugu News