Bonda Uma: బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ కార్యకర్తల దాడి.. కారు ధ్వంసం, గాయాలు

  • మాచర్లలో బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడి
  • కారు అద్దాలను పగలగొట్టిన వైసీపీ శ్రేణులు
  • దాడిలో గాయపడ్డ టీడీపీ నేతలు
YSRCP supporters attacks Bonda Uma and Budda Venkanna

టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేతలు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో కాపు కాసి, వీరిపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది.

టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకుంటోందనే వార్తలతో... వాకబు చేసేందుకు వీరు మాచర్లకు వచ్చారు. ఈ సందర్భంలో వారిపై దాడి జరిగింది. పెద్ద కర్రతో ఓ వ్యక్తి కారు అద్దాలను పగలగొట్టాడు. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కూడా వారి వాహనాన్ని వెంటాడే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ఇద్దరు నేతలకు గాయాలయ్యాయి. వారి శరీరం నుంచి రక్తం కారింది. ఈ ఘటనతో మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

More Telugu News