Rashmika Mandanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో సినిమాకి ఓకే చెప్పిన రష్మిక 
  • దిల్ రాజు చేతిలో 'భీష్మ' నైజాం హక్కులు 
  • పారితోషికం పెంచేసిన అక్కినేని హీరో
Rashmika bags one more movie in Tollywood

 *  కన్నడ బ్యూటీ రష్మిక టాలీవుడ్ లో దూసుకుపోతోంది. వరుసగా సినిమాలను అంగీకరిస్తూ జోరు పెంచుతోంది. ఈ క్రమంలో తాజాగా అక్కినేని నాగ చైతన్య సరసన ఓ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. చైతన్య హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందే 'నాగేశ్వరరావు' చిత్రంలో కథానాయికగా రష్మికను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.
*  నితిన్ హీరోగా నటించిన 'భీష్మ' చిత్రం నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన 6.5 కోట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నారు.
*  'మజిలీ', 'వెంకీ మామ' చిత్రాల విజయాలతో హీరో నాగ చైతన్య తన పారితోషికాన్ని పెంచేశాడు. ఈ క్రమంలో ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి ఆయన 8 కోట్లు తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

More Telugu News