కొరియన్ మూవీ రీమేక్ లో రెజీనా .. నివేద థామస్
- హిట్ కొట్టిన 'మిడ్ నైట్ రన్నర్స్'
- తెలుగు రీమేక్ కి సన్నాహాలు
- శిక్షణ తీసుకుంటున్న రెజీనా, నివేద
2017 లో వచ్చిన 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ మూవీ అక్కడ వైవిధ్యభరితమైన చిత్రంగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు పోలీస్ శిక్షణలో వుంటారు. ఓ అర్ధరాత్రివేళ వాళ్లు విలన్ ను తరుముతూ వెళతారు. అప్పుడు ఏం జరిగిందనేదే కథ.
కొరియన్ సినిమాలో ఇద్దరు హీరోలు ఉండగా, తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి హీరోయిన్స్ తో ఈ కథను చేస్తే కొత్తగా ఉంటుందని భావించారు. ఆ రెండు పోలీస్ పాత్రలకి రెజీనా - నివేద థామస్ లను తీసుకున్నారు. ఒరిజినల్ మూవీకి ఫైట్ మాస్టర్స్ గా చేసినవారే ఈ తెలుగు సినిమాకి పనిచేయనున్నారట. వాళ్ల దగ్గరే రెజీనా - నివేద శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం.