ప్రకాశం జిల్లాలో రాజధాని కావాలంటూ జిల్లా కాంగ్రెస్ నేతల దీక్ష
- ఆమరణ దీక్షకు దిగిన యువజన విభాగం అధ్యక్షుడు శ్రీపతి సతీశ్
- 'పేరుకే ప్రకాశం, లేదు జిల్లాకు వికాసం' అంటూ నినాదాలు
- కందూకూరులో అమరావతికి మద్దతుగా టీడీపీ నేతల దీక్ష
శివరామకృష్ణన్ కమిటీ సూచించిన సిఫారసుల మేరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న ప్రకాశంను రాజధాని చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అదే జిల్లాలో మరోపక్క అమరావతి రాజధానిగా ఉండాలంటూ టీడీపీ దీక్షలకు దిగింది. కందుకూరులో అమరావతి పరిరక్షణకోసం టీడీపీ ఎస్సీ సెల్ నేతలు దీక్షకు దిగారు.