గోదావరి నుంచి బోటును బయటికి తీసిన డైవర్లను సన్మానించిన మంత్రి అవంతి

షార్ట్స్‌లో చూడండి
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో పర్యాటక బోటు మునిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ధర్మాడి సత్యం బృందం ఎంతో శ్రమించి బోటును వెలికితీసింది. ఈ వెలికితీత ప్రక్రియలో డైవర్లు ఎంతో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో బోటును బయటికి తీసిన డైవర్లకు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సన్మానం చేశారు. వారి నైపుణ్యాన్ని, తెగువను కొనియాడారు. బోటు ప్రమాదంలో ఇప్పటికీ ఐదుగురి ఆచూకీ దొరకలేదని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో విశాఖ, భీమిలి, అరకు ఉత్సవాలు నిర్వహిస్తామని తెలియజేశారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో ఈ ఉత్సవాలకు రూ.2 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. నవంబరు 9, 10 తేదీల్లో భీమిలి ఉత్సవ్, డిసెంబరు 26, 27 తేదీల్లో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తామని వివరించారు. ఆపై వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అరకు ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.
Go Back to Shorts
Godavari
East Godavari District

More Telugu News