మనసున్న మారాణి...క్యాన్సర్ బాధితుల కోసం సన్నీలియోనీ చిత్రలేఖనం
- పెయింటింగ్లు వేసి వేలానికి ఉంచనున్నట్లు ప్రకటన
- ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్
- వచ్చిన నిధులు బాధితుల కోసం ఖర్చు చేస్తానని వెల్లడి
‘క్యాన్సర్ బాధితుల కోసం నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాను. ఇందుకోసం పెయింటింగ్స్ వేశాను. వాటిని వేలానికి ఉంచుతున్నాను. అలా వచ్చిన డబ్బును క్యాన్సర్ బాధితులకు అందజేస్తాను‘ అంటూ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కొన్ని పెయింటింగ్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
'పెయింటింగ్లు వేసినప్పుడే క్యాన్సర్ బాధితుల కోసం ఆలోచించాను. మీరు కూడా క్యాన్సర్ బాధితుల కోసం తోచిన సాయం చేయండి' అంటూ సూచించారు.