Godavari: గోదావరిలో బోటు ప్రమాదంపై ఎంపీ హర్షకుమార్ పిటిషన్.. విచారిస్తున్న సుప్రీంకోర్టు

షార్ట్స్‌లో చూడండి
గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంపై సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ హర్ష కుమార్ పిటిషన్ వేశారు. ఈ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇంత వరకు ఆచూకీ లేకుండా పోయిన మృత దేహాలను వెంటనే వెలికి తీసేలా ఆదేశాలను ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. బోటు ప్రమాదం విచారణలో కేంద్ర ప్రభుత్వం కూడా తోడయ్యేలా సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేయాలని విన్నవించారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

మరోవైపు, బోటు ప్రమాదానికి సంబంధించి ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బోటులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 90 మందికి పైగానే ఉంటుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో, హర్షకుమార్ పై పోలీసు కేసు నమోదైంది. ఆయన కోసం పోలీసు టీములు గాలిస్తున్నాయి.
Go Back to Shorts
Godavari
Boat Accident
Harsha Kumar
Supreme Court

More Telugu News