Pushpasrivani: పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటూ ఫిర్యాదు... టీడీపీ కుట్రగా పేర్కొన్న ఏపీ మంత్రి

షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం లీగల్ అడ్వైజర్ రేగు మహేశ్, ఆలిండియా దళిత హక్కుల సంఘం ఏపీ చీఫ్ మణి సింగ్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు ఫిర్యాదు చేశారు. పుష్పశ్రీవాణి కొండదేవర తెగకు చెందిన వ్యక్తి కాదని, ఆమె గిరిజన మహిళ కాదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో సైతం పుష్పశ్రీవాణి అసత్యాలు పొందుపరిచారని తెలిపారు.

అయితే, దీనిపై స్పందించిన మంత్రి పుష్పశ్రీవాణి దీనిని టీడీపీ కుట్రగా అభివర్ణించారు. గత 11 ఏళ్లుగా ఈ వివాదం నడుస్తోందని, గతంలో పలు పర్యాయాలు ఇలాగే ఆరోపణలు చేశారని, న్యాయం తన పక్షానే నిలిచిందని చెప్పారు. ఆ ఆరోపణలు కోర్టులో నిలబడలేదని, ఈసారి కూడా సత్యమే గెలుస్తుందని అన్నారు. కాగా, రేగు మహేశ్, మణి సింగ్ ల ఫిర్యాదుపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Pushpasrivani
YSRCP
Andhra Pradesh
Telugudesam

More Telugu News