కొత్త రాజధాని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు...?
- రాజధాని తరలింపు ఆలోచనలో వైసీపీ సర్కారు అంటూ జీవీఎల్ వ్యాఖ్యలు
- మీడియా సమావేశం తర్వాత పిచ్చాపాటీ మాట్లాడుతూ కొత్త రాజధానిపై సూచనప్రాయ సంకేతాలు!
- ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న దొనకొండ పేరు!
మీడియా సమావేశం ముగిసిన తర్వాత సన్నిహితులైన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జీవీఎల్ ఈ విషయం చెప్పినట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో రాజధాని అంటే ఎప్పటినుంచో దొనకొండ పట్టణం రాజధాని పరిశీలన ప్రాంతాల జాబితాలో నలుగుతూ వస్తోంది. అమరావతి రాజధానిగా ప్రకటించకముందు దొనకొండ కూడా రేసులో నిలిచింది. దాంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి.