Jagan: అన్నదాతల ముఖాల్లో ఆనందం నింపేలా ప్రకృతి సహకరించడం శుభసూచకం: సీఎం జగన్

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలోని ప్రధాన డ్యాములన్నీ జలకళతో పరవళ్లు తొక్కడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి మరికాస్త దూరంలోనే ఉన్నాయని ట్వీట్ చేశారు. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. అన్నదాతల ముఖాల్లో ఆనందం నింపేలా ప్రకృతి కూడా రైతులకు సహకరిస్తుండడం శుభసూచకం అని తెలిపారు. ఇటీవలే, శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాముల నుంచి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడడంతో శ్రీశైలం ప్రాజక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది.
Go Back to Shorts
Jagan
Andhra Pradesh

More Telugu News