Jagan: ఇంతమంది పరీక్షలు రాస్తుండడం ఎప్పుడూ చూడలేదు: సీఎం జగన్

షార్ట్స్‌లో చూడండి
గ్రామ సచివాలయాల అంశంపై సీఎం జగన్ స్పందించారు. ప్రతి జిల్లా కలెక్టర్ కూడా గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డలా చూసుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం ప్రతి జిల్లాలో కనీసం లక్ష మంది పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. ఇంతమంది పరీక్షలు రాస్తుండడం గతంలో ఎప్పుడూ చూడలేదని జగన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కలెక్టర్లు చూసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు ధ్యాస పెడితే అనేక సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'స్పందన' కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సందర్భంగా జగన్ పైవ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News