naresh goel: రూ. 650 కోట్ల పన్ను ఎగవేత కేసులో నరేష్ గోయల్ కు నోటీసులు

షార్ట్స్‌లో చూడండి
జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ. 650 కోట్ల పన్ను ఎగవేత కేసులో ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆయనకు ఐటీ శాఖ సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి. ముంబైలోని జెట్ ఎయిర్ వేస్ కార్యాలయంలో గత ఏడాది ఐటీ అధికారులు సోదాలు జరిపారు. పలు డాక్యుమెంట్లను అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. దుబాయిలోని ఒక ఎయిలైన్స్ కంపెనీతో జెట్ ఎయిర్ వేస్ కు అక్రమ లావాదేవీలు జరిగాయని దర్యాప్తులో తేలింది. దుబాయ్ లోని ఒక జనరల్ సేల్స్ ఏజెంట్ కు ప్రతి ఏటా భారీ మొత్తంలో కమిషన్లను ముట్టచెప్పినట్టు అధికారులు నిర్ధారించారు. ఆదాయపు పన్ను చట్టం కింద ఉన్న పరిమితులకు మించి ఈ చెల్లింపులు జరిగినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో గోయల్ కు నోటీసులు జారీ అయ్యాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో జెట్ ఎయిర్ వేస్ మూతపడిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
naresh goel
it
notice

More Telugu News