TTD: నేటి ఉదయం 11 గంటల నుంచి 3:30 గంటల వరకు తిరుమల ఆలయం మూసివేత
తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు మహాసంప్రోక్షణ జరగనున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి 3:30 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. వరాహస్వామి ఆలయంలో ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు కర్కాటక లగ్నంలో ఈ క్రతువు జరగనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాల్లో భాగంగా తోమాల, అర్చన, నైవేద్యం, రెండో గంట తదితర పూజాదికాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయనున్నామని, భక్తులు గమనించాలని కోరారు.