మోహన్ బాబు చేస్తున్నది విద్యాదానం కాదు.. వ్యాపారం: కుటుంబరావు
- కక్షపూరితంగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు
- వైసీపీకి మద్దతుగా ఎన్నికల సమయంలో రాద్ధాంతం చేస్తున్నారు
- ఐదేళ్లలో రూ. 14,510 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ చేశాం
మోహన్ బాబు విద్యాదానం చేయడం లేదని, కేవలం వ్యాపారం మాత్రమే చేస్తున్నారని కుటుంబరావు ఆరోపించారు. తన కాలేజీలలో విద్యార్థులకు ఫ్రీగా చదువు చెబుతున్నానని, 25 శాతం మంది విద్యార్థులకు ఫీజులు తానే కడుతున్నానని గొప్పలు చెప్పుకుంటుంటారని... అలాంటి వ్యక్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తాను చెప్పిన విషయాలపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమేనని చెప్పారు.