హిందువులపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు.. ఈసీకి వీహెచ్పీ ఫిర్యాదు
- నిన్న కేసీఆర్ ‘హిందూ గాళ్లు, బొందు గాళ్లు..’అన్నారు
- రజత్ కుమార్ కు లిఖిత ఫిర్యాదు చేశాం
- చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాం: వీహెచ్పీ
అనంతరం, మీడియాతో వారు మాట్లాడారు. ‘హిందూ గాళ్లు, బొందు గాళ్లు.. ఈ దిక్కుమాలిన దరిద్రుల చేతిలో పడి ఈ దేశం విలవిలలాడుతోంది’ అంటూ హిందువులపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. కాగా, లిఖిత పూర్వక ఫిర్యాదుతో పాటు కేసీఆర్ ప్రసంగానికి సంబంధించిన సీడీని రజత్ కుమార్ కు ఇచ్చినట్టు తెలిపారు.
అంతేకాకుండా, సుప్రీంకోర్టును కించపరిచేలా, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా కేసీఆర్ ప్రసంగించారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రజత్ కుమార్ ను కోరినట్టు చెప్పారు.ఈ ఫిర్యాదుపై రజత్ కుమార్ స్పందించారని, ఈ విషయమై కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ఆ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు.