మాటలు రావడం లేదు: పుల్వామా ఘటనపై సెహ్వాగ్
- సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- అమరులైన 42 మంది సైనికులు
- ఇకనైనా మారాలని ఉగ్రవాదులకు సెహ్వాగ్ హెచ్చరిక
సీఆర్పీఎఫ్ 54వ బెటాలియన్కు చెందిన జవాన్ల కాన్వాయ్ జమ్ము-శ్రీనగర్ హైవేపైనుంచి వెళ్తుండగా పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ దాడికి తెగబడింది. దాదాపు 350 కిలోల పేలుడు పదార్థాలు నింపిన ఎస్యూవీ వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చి వేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 42 మంది సైనికులు అమరులయ్యారు. పదుల సంఖ్యలో జవాన్లు గాయపడ్డారు.