'మిస్టర్ మజ్ను' దర్శకుడికి ఫుల్ డిమాండ్
- 'తొలిప్రేమ'తో తొలి హిట్
- థియేటర్స్ లో 'మిస్టర్ మజ్ను'
- పోటీ పడుతోన్న యువ హీరోలు
ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ చేయనున్నాడని తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో వెంకీ అట్లూరి కథా చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు తరువాత వెంకీ అట్లూరి .. నాగ చైతన్యతో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. తన కోసం ఒక మంచి కథను సిద్ధం చేయమని చైతూ అడిగినట్టు చెబుతున్నారు. ఇక నితిన్ .. నాగశౌర్య కూడా ఆయనతో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా యంగ్ హీరోలు పోటీ పడుతుండటంతో, వెంకీ అట్లూరికి ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది.