అయ్యప్ప ఆలయంలోకి మహిళలు.. నిరసనగా రేపు కేరళ బంద్!
- అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన బిందు, కనకదుర్గ
- దేశవ్యాప్తంగా కలకలం
- ఆలయాల మూసివేత.. సంప్రోక్షణ
అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన బిందు (44) సీపీఐ (ఎంఎల్) కార్యకర్త. కాలేజీ లెక్చరర్ కూడా. 42 ఏళ్ల కనకదుర్గ కేరళ ప్రభుత్వ పౌర సరఫరాల విభాగంలో పనిచేస్తున్నారు. గత నెల 24న శబరిమల వచ్చి ఆలయంలోకి వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేసిన 11 మంది మహిళల బృందంలో వీరు కూడా ఉన్నారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశించారని తెలియడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. మహిళ ప్రవేశానికి నిరసగా దేశవ్యాప్తంగా అయ్యప్ప ఆలయాలు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకున్నాయి.