పునాదుల పేరిట ఎంతకాలమీ మోసం?: చంద్రబాబుపై వైకాపా విమర్శలు
- తాత్కాలిక భవనాలు తప్ప శాశ్వత భవనాలేవి
- చంద్రబాబు మరో మోసపు నాటకం
- ఢిల్లీలో వైకాపా మాజీ ఎంపీ వరప్రసాద్
బీజేపీతో కలసి చంద్రబాబు, ఏపీని ఎలా మోసం చేశారో చెప్పేందుకే ఈ దీక్షను చేపట్టామని ఆయన తెలిపారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయించుకునే స్థితిలో లేని చంద్రబాబు ఓ అసమర్దుడిగా నిలిచిపోయారని నిప్పులు చెరిగారు. బీజేపీతో కలిసున్నంతకాలం కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని చంద్రబాబు, ఇప్పుడు పునాది రాయిని చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వరప్రసాద్ విమర్శలు గుప్పించారు. హోదాపై ఆది నుంచి పోరాడుతున్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని, తాము రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచామని గుర్తు చేశారు.