నా కొడుక్కి వైకాపాతో సంబంధాలు లేవు: శ్రీనివాసరావు తల్లిదండ్రులు

  • ఆ పార్టీ నేతలతో పరిచయాలు కూడా లేవు
  • అసలు వాడు ఊరిలో సరిగ్గా ఉండేవాడు కాదు
  • సిట్ విచారణలో తాతారావు, సావిత్రమ్మ
తమ కుమారుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవని, తమకు కూడా ఆ పార్టీ నేతలతో పరిచయాలు లేవని వైఎస్ జగన్ పై కత్తితో హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు తల్లిదండ్రులు సావిత్రమ్మ, తాతారావులు స్పష్టం చేశారు. నిన్నంతా వారిని విడివిడిగా, శ్రీనివాసరావుతో కలిపి విచారించిన పోలీసులు, పలు కోణాల్లో ప్రశ్నించారు.

తమ బిడ్డ ఊరిలో సరిగ్గా ఉండేవాడు కాదని వారు విచారణలో చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏ రాజకీయ పార్టీతో తిరిగేవాడు? చురుకుగా ఉండేవాడా? వంటి ప్రశ్నలను సంధించిన సిట్ అధికారులు వారితో సమాధానాలు చెప్పించారు. ముమ్మడివరంలోని ఠానేలంక నుంచి సావిత్రమ్మ, తాతారావులను బుధవారం రాత్రి విశాఖకు తీసుకువచ్చిన అధికారులు, నిన్నంతా వారిని స్టేషన్ లోనే ఉంచి విచారించారు.
Go Back to Shorts
Vizag
YSRCP
Srinivasa Rao
SIT
Police

More Telugu News