Maharashtra: మహారాష్ట్రలో లోయలోపడ్డ బస్సు.. 33 మంది దుర్మరణం!

షార్ట్స్‌లో చూడండి
ఓ డ్రైవర్ తప్పిదం కారణంగా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 33 మంది ప్రాణాలు గాల్లో కలసిపోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దపోలీలోని డా.బాలాసాహెబ్ సావంత్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ కు చెందిన 40 మంది సిబ్బంది ఈ రోజు విహారయాత్రలో భాగంగా మహాబలేశ్వరంకు బయలుదేరారు. అయితే వీరు మాట్లాడుకున్న ప్రైవేటు బస్సు అంబేనాలీ ఘాట్ ప్రాంతంలో రోడ్డుపై ఓ మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి 500 అడుగుల లోతున్న లోయలోకి జారిపోయింది. ఈ ఘటనలో బస్సు నుజ్జునుజ్జు కావడంతో 32 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారు గాయాలపాలయ్యారు.


ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ ఓ వ్యక్తి లోయ నుంచి రోడ్డుపైకి ఎక్కి వచ్చి సమాచారం అందించాడు. దీంతో జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Go Back to Shorts
Maharashtra
32 dead
bus accident
dapoli
Dr Balasaheb Sawant Konkan Krishi Vidyapeeth
NDRF
mumbai
Ambenali ghat

More Telugu News