pooja hegde: టాలీవుడ్ లో ఏ హీరోయిన్ పారితోషికం ఎంతో తెలుసా?

షార్ట్స్‌లో చూడండి
ఏ హీరోయన్ అయినా ఒక్క హిట్ పడిందంటే చాలు... పారితోషికాన్ని అమాంతం పెంచేస్తుంది. కానీ పూజా హెగ్డే రూటే వేరు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఈ అమ్మడు మూడు సినిమాలు చేసింది. ఈ మూడు సినిమాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. అయినా పూజా కోసం దర్శక నిర్మాతలు వెంటపడుతున్నారు. ఈ నేపథ్యంలో, తన నాలుగవ సినిమా 'సాక్ష్యం'కు పూజా ఏకంగా రూ. 1.5 కోట్లు డిమాండ్ చేసిందట. వారు కూడా ఇంత మొత్తం ఇవ్వడానికి ఓకే చెప్పేశారు. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరోవైపు ఒక్కో సినిమాకు కీర్తి సురేష్ రూ. 85 లక్షలు, సాయి పల్లవి రూ. 85 లక్షలు, నివేదా థామస్ రూ. 70 లక్షలు, అనుపమ పరమేశ్వరన్ రూ. 60 లక్షలు, అను ఇమ్మాన్యుయేల్ రూ. 50 లక్షలు వసూలు చేస్తున్నారని సమాచారం. మహేష్ బాబు సరసన నటిస్తున్న కైరా అద్వానీ తన రెండో సినిమాను రామ్ చరణ్ తో చేయనుందట. ఈ సినిమా కోసం ఆమె రూ. 70 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం.  
Go Back to Shorts
pooja hegde
keerthi suresh
sai pallavi
Niveda Thomas
anupama parameswaran
anu immanuel
remuneration

More Telugu News