Pawan Kalyan: అంజన్నను దర్శించుకున్న జనసేన అధినేత పవన్.. చిత్రమాలిక!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిరంతర ప్రజా యాత్ర (చలోరే చలోరే చల్) ఈరోజు ఉదయం ప్రారంభించారు. హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయం నుంచి కొండగట్టుకు బయలుదేరి వెళ్లిన పవన్ కల్యాణ్, ‘అంజన్న’ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, పవన్ కల్యాణ్ కొండగట్టు చేరుకోగానే ఆయన్ని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ఈ నేపథ్యంలో అభిమానులను పోలీసులు అదుపు చేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు..











