raghuveera reddy: గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కనకదుర్గమ్మ కిరీటం కాజేశారు.. ఇప్పుడు మళ్లీ అపచారం: రఘువీరారెడ్డి
గతంలో తొమ్మిదేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ దుర్గగుడిలో కనకదుర్గమ్మ కిరీటం కొట్టేశారని, ఆ స్థానంలో నకిలీ కిరీటం పెట్టారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఇప్పుడు కూడా అంతకంటే పెద్ద అపచారం చేశారని విమర్శించారు. దుర్గగుడిలో తాంత్రిక పూజల నిర్వహణ ప్రభుత్వ అనుమతి లేకుండానే జరిగిందా? అని ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుర్గగుడిలో తాంత్రిక పూజల విషయంలో టీడీపీ నియమించే కమిటీలపై ప్రజల్లో విశ్వాసం లేదని, హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాంత్రిక పూజలు కచ్చితంగా జరిగాయని, ఎవరు? ఎందుకు? జరిపించారో తెలియాలని వ్యాఖ్యానించారు.