ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకిన 'పద్మావతి' సినిమా వివాదం
- సినిమా విడుదలను నిషేధించాలని తమిళనాడులో నిరసనలు
- కాని పక్షంలో థియేటర్ల ముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరికలు
- పోరాటాలు కూడా చేస్తామంటున్న తమిళనాడు విశ్వ హిందు పరిషత్
భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రంలో హిందూ సమాజాన్ని, రాజ్పుత్ మహారాణుల గౌరవాన్ని కించపరిచే దృశ్యాలు ఉండనున్నాయనే అనుమానంతో గత కొన్ని రోజులుగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైతే పద్మావతి పాత్ర పోషించిన నటి దీపికా పదుకునే మీద దాడి చేసేందుకు కూడా తాము సిద్ధమేనని రాజ్పుత్ కర్ణి సేన సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న ఈ చిత్రం విడుదలవుతుందా? లేదా? అనే సందిగ్ధం ఏర్పడింది.