దేశవ్యాప్తంగా 12వ తేదీన పెట్రోల్ బంకులు బంద్!
- 12వ తేదీ అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల సమ్మె
- దేశవ్యాప్తంగా డీలర్ల నిరసన
- పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్
అప్పటికీ కేంద్రం తమను పట్టించుకోకపోతే ఈ నెల 27 నుంచి నిరవధికంగా కొనుగోళ్లు, అమ్మకాలను నిలిపివేస్తామని యూపీఎఫ్ హెచ్చరించింది. తమ సమస్యలు, డిమాండ్లు పరిష్కరిస్తామని గత నవంబర్ లో హామీనిచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) ఆ తరువాత వాటిని పట్టించుకోవడం మానేశాయని 'ఆల్ కర్ణాటక ఫ్రంట్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్' అధ్యక్షుడు బీఆర్ రవీంద్రనాథ్ ఆరోపించారు. పెట్రోల్ డీలర్లకు 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధించేలా మార్గదర్శకాల్లో సవరణ చేయడం ఏకపక్షం, అన్యాయమని ఆయన ఆరోపించారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.