మనవాళ్లు చైనాకు పట్టుబడ్డప్పుడు నా పనైపోయిందనుకున్నా: అజిత్ దోవల్
- యువ ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పటి ఘటనను గుర్తుచేసుకున్న డోభాల్
- ఆయన పంపిన నిఘా బృందాన్ని చైనా సైన్యం అదుపులోకి తీసుకుంది
- ఈ ఘటనతో తన కెరీర్ ముగిసిపోయిందని భావించినట్లు వెల్లడి
- హెడ్ క్వార్టర్స్ ఇచ్చిన తప్పుడు మ్యాపుల వల్లే సమస్య తలెత్తిందని విచారణలో తేలింది
- ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో పాత జ్ఞాపకాలను పంచుకున్న డోభాల్
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తన ఉద్యోగ జీవితం తొలినాళ్లలో ఎదురైన ఓ క్లిష్టమైన సంఘటనను గుర్తుచేసుకున్నారు. చైనా సైన్యం తన బృందాన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు, ఇక తన పనైపోయిందన్న ఆందోళనకు గురయ్యానని ఆయన వెల్లడించారు. ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఈ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
సిక్కిం భారత్లో విలీనమవుతున్న సమయంలో తాను యువ ఐపీఎస్ అధికారిగా అక్కడ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చూసేవాడినని దోవల్ తెలిపారు. సరిహద్దుల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కదలికలపై నిఘా పెట్టడం తన విధుల్లో భాగమని చెప్పారు. ఆ క్రమంలో, సరిహద్దు ప్రాంతంలో నిఘా కోసం ఒక బృందాన్ని పంపానని, వారు సుమారు 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉందని పేర్కొన్నారు.
అయితే, రోజులు గడుస్తున్నా వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదని దోవల్ వివరించారు. "5 రోజులు, 10 రోజులు, 15 రోజులు గడిచినా వారి ఆచూకీ తెలియలేదు. హిమపాతం వంటి ప్రమాదాలు జరిగినట్లు కూడా ఎక్కడా సమాచారం లేదు. దీంతో వృత్తిపరంగా, మానవతా దృక్పథంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాను" అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్ వచ్చిందని, తాను పంపిన బృందం చైనా కస్టడీలో ఉందని ఉన్నతాధికారి చెప్పినప్పుడు మరింత ఆందోళన చెందానని తెలిపారు.
చర్చల అనంతరం చైనా ఆ బృందాన్ని తిరిగి భారత్కు అప్పగించిందని దోవల్ చెప్పారు. "కానీ, వారు తిరిగి వచ్చినప్పుడు మానసికంగా, శారీరకంగా పూర్తిగా కుంగిపోయి ఉన్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభం కావడంతో, చిన్న వయసులోనే తన కెరీర్ ముగిసిపోయిందని, మరో కొత్త ఉద్యోగం చూసుకోవాలని భావించినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు.
అయితే, విచారణలో అసలు వాస్తవం బయటపడింది. తన బృందానికి హెడ్ క్వార్టర్స్ నుంచి అందించిన మ్యాపులు, స్కెచ్లలో లోపాలు ఉన్నాయని, ఆ తప్పిదం కారణంగానే వారు దారి తప్పి చైనా భూభాగంలోకి వెళ్లారని తేలింది. దీంతో ఈ ఘటనలో తన తప్పేమీ లేదని నిరూపితమైనట్లు దోవల్ తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.
సిక్కిం భారత్లో విలీనమవుతున్న సమయంలో తాను యువ ఐపీఎస్ అధికారిగా అక్కడ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చూసేవాడినని దోవల్ తెలిపారు. సరిహద్దుల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కదలికలపై నిఘా పెట్టడం తన విధుల్లో భాగమని చెప్పారు. ఆ క్రమంలో, సరిహద్దు ప్రాంతంలో నిఘా కోసం ఒక బృందాన్ని పంపానని, వారు సుమారు 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉందని పేర్కొన్నారు.
అయితే, రోజులు గడుస్తున్నా వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదని దోవల్ వివరించారు. "5 రోజులు, 10 రోజులు, 15 రోజులు గడిచినా వారి ఆచూకీ తెలియలేదు. హిమపాతం వంటి ప్రమాదాలు జరిగినట్లు కూడా ఎక్కడా సమాచారం లేదు. దీంతో వృత్తిపరంగా, మానవతా దృక్పథంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాను" అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్ వచ్చిందని, తాను పంపిన బృందం చైనా కస్టడీలో ఉందని ఉన్నతాధికారి చెప్పినప్పుడు మరింత ఆందోళన చెందానని తెలిపారు.
చర్చల అనంతరం చైనా ఆ బృందాన్ని తిరిగి భారత్కు అప్పగించిందని దోవల్ చెప్పారు. "కానీ, వారు తిరిగి వచ్చినప్పుడు మానసికంగా, శారీరకంగా పూర్తిగా కుంగిపోయి ఉన్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభం కావడంతో, చిన్న వయసులోనే తన కెరీర్ ముగిసిపోయిందని, మరో కొత్త ఉద్యోగం చూసుకోవాలని భావించినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు.
అయితే, విచారణలో అసలు వాస్తవం బయటపడింది. తన బృందానికి హెడ్ క్వార్టర్స్ నుంచి అందించిన మ్యాపులు, స్కెచ్లలో లోపాలు ఉన్నాయని, ఆ తప్పిదం కారణంగానే వారు దారి తప్పి చైనా భూభాగంలోకి వెళ్లారని తేలింది. దీంతో ఈ ఘటనలో తన తప్పేమీ లేదని నిరూపితమైనట్లు దోవల్ తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.