కళ్లలో కారం చల్లి భర్త దారుణ హత్య.. లొంగిపోయిన తల్లీకొడుకులు

కళ్లలో కారం చల్లి భర్త దారుణ హత్య.. లొంగిపోయిన తల్లీకొడుకులు

Husband brutally murdered by throwing chili powder in eyes mother and son surrender
  • మెదక్ జిల్లా తూప్రాన్‌లో అర్ధరాత్రి ఘటన
  • భర్తను హతమార్చిన భార్య, కుమారుడు
  • దాడికి ముందు కళ్లలో కారం చల్లిన నిందితులు
  • కుటుంబ కలహాలే కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా
మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తను భార్య, కన్నతండ్రిని కుమారుడు కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి వెలుగుచూసింది. హత్య అనంతరం నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.

వివరాల్లోకి వెళితే.. ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన కొండపురం శ్రీరాములు (50) బోర్‌వెల్ ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మరోసారి గొడవ జరగడంతో, అది కాస్తా తీవ్రస్థాయికి చేరింది. ఆగ్రహానికి గురైన భార్య, కుమారుడు కలిసి శ్రీరాములు కళ్లలో కారం చల్లి, ఆపై దాడి చేసి దారుణంగా హతమార్చారు.

హత్య అనంతరం నిందితులైన తల్లీకొడుకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Advertisement
Kondapuram Sriramulu
Medak murder case
Tupran crime news
Islampur village murder
Family dispute killing
Medak police investigation

More Telugu News