మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. మంధాన సరసన వోల్వార్ట్
- విధ్వంసక సెంచరీతో చెలరేగిన లారా వోల్వార్ట్
- స్మృతి మంధాన 18 అంతర్జాతీయ సెంచరీల రికార్డు సమం
- జింబాబ్వేపై 80 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం
- ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ 3-0తో కైవసం
దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్ట్ అరుదైన ప్రపంచ రికార్డును సమం చేసింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన ఆమె, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన మహిళా క్రికెటర్గా భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన పేరిట ఉన్న రికార్డును అందుకుంది. దీంతో వీరిద్దరూ ప్రస్తుతం 18 సెంచరీలతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది.
బులవాయో వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో వోల్వార్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 62 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 126 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా తరఫున మహిళల టీ20ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో 2010లో షాండ్రే ఫ్రిట్జ్ (116*) నెలకొల్పిన రికార్డును వోల్వార్ట్ అధిగమించింది. ఆమెకు టీ20 ఫార్మాట్లో ఇది నాలుగో సెంచరీ.
వోల్వార్ట్ అద్భుత ఇన్నింగ్స్తో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 120 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్ అన్నెరీ డెర్క్సెన్ 15 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వోల్వార్ట్కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 సెప్టెంబర్ 17న జరగనుంది.
బులవాయో వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో వోల్వార్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 62 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 126 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా తరఫున మహిళల టీ20ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో 2010లో షాండ్రే ఫ్రిట్జ్ (116*) నెలకొల్పిన రికార్డును వోల్వార్ట్ అధిగమించింది. ఆమెకు టీ20 ఫార్మాట్లో ఇది నాలుగో సెంచరీ.
వోల్వార్ట్ అద్భుత ఇన్నింగ్స్తో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 120 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్ అన్నెరీ డెర్క్సెన్ 15 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వోల్వార్ట్కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 సెప్టెంబర్ 17న జరగనుంది.