కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది బంగ్లాదేశీయులు సజీవ దహనం

Kolkata fire accident nine Bangladeshis burnt alive
  • మృతులంతా వైద్య చికిత్స కోసం వచ్చినవారే
  • ఆరుగురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
  • ఘటనపై అధికారుల దర్యాప్తు ప్రారంభం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మృతులందరూ బంగ్లాదేశ్ పౌరులని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో నగరంలోని మిర్జా గాలిబ్ వీధిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చి సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మృతులంతా వైద్య చికిత్స నిమిత్తం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన మరో ఆరుగురిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.        
Advertisement
Kolkata Fire
Mirza Ghalib Street
Bangladeshis
West Bengal
Fire accident
Kolkata news

More Telugu News