బెంగాల్ టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. మమతకు లీగల్ నోటీసు
- టీఎంసీలో తీవ్రమైన అసమ్మతి సెగలు
- మమతా బెనర్జీకి రెబల్ ఎంపీ కుమారుడి లీగల్ నోటీసు
- ఇద్దరు రెబల్ ఎంపీలను పార్టీ పదవుల నుంచి తొలగించిన అధిష్ఠానం
- పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మానస్ భూనియా
- ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమైన టీఎంసీ రెబల్ ఎంపీలు
పశ్చిమ బెంగాల్లోని ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. ఒకవైపు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకే రెబల్ ఎంపీ కుమారుడు లీగల్ నోటీసులు పంపగా, మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఇద్దరు లోక్సభ సభ్యులపై అధిష్ఠానం వేటు వేసింది. ఇదే సమయంలో ఓ సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
బీజేపీ నేతలతో సమావేశమయ్యారన్న వార్తల నేపథ్యంలో టీఎంసీ అధిష్ఠానం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కోల్కతా (ఉత్తర) ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ను ఆ నియోజకవర్గ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో మమత విధేయుడైన ఎమ్మెల్యే కునాల్ ఘోష్ను నియమించింది. అదేవిధంగా, జాదవ్పూర్ ఎంపీ సాయోని ఘోష్ను కూడా పార్టీ యువజన విభాగం అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. శనివారం సుదీప్ బందోపాధ్యాయ్, మరో రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్తో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మరోవైపు, టీఎంసీ రెబల్ ఎంపీ కాకలీ ఘోష్ దస్తీదార్ కుమారుడు వైద్యనాథ్ ఘోష్ దస్తీదార్.. మమతా బెనర్జీతో పాటు పలువురు టీఎంసీ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. తనపై తప్పుడు, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బరాసత్ అసెంబ్లీ టికెట్ ఆశించడం వల్లే తన తల్లి కాకలీ ఘోష్ తిరుగుబాటు చేశారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, కాకలీ ఘోష్ నేతృత్వంలోని రెబల్ ఎంపీలు ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ పరిణామాల మధ్య, టీఎంసీ సీనియర్ నేత, మాజీ మంత్రి మానస్ రంజన్ భూనియా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగే అవకాశం కనిపించడం లేదని పేర్కొంటూ ఆయన తన రాజీనామా లేఖను మమతా బెనర్జీకి పంపారు.
బీజేపీ నేతలతో సమావేశమయ్యారన్న వార్తల నేపథ్యంలో టీఎంసీ అధిష్ఠానం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కోల్కతా (ఉత్తర) ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ను ఆ నియోజకవర్గ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో మమత విధేయుడైన ఎమ్మెల్యే కునాల్ ఘోష్ను నియమించింది. అదేవిధంగా, జాదవ్పూర్ ఎంపీ సాయోని ఘోష్ను కూడా పార్టీ యువజన విభాగం అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. శనివారం సుదీప్ బందోపాధ్యాయ్, మరో రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్తో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మరోవైపు, టీఎంసీ రెబల్ ఎంపీ కాకలీ ఘోష్ దస్తీదార్ కుమారుడు వైద్యనాథ్ ఘోష్ దస్తీదార్.. మమతా బెనర్జీతో పాటు పలువురు టీఎంసీ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. తనపై తప్పుడు, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బరాసత్ అసెంబ్లీ టికెట్ ఆశించడం వల్లే తన తల్లి కాకలీ ఘోష్ తిరుగుబాటు చేశారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, కాకలీ ఘోష్ నేతృత్వంలోని రెబల్ ఎంపీలు ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ పరిణామాల మధ్య, టీఎంసీ సీనియర్ నేత, మాజీ మంత్రి మానస్ రంజన్ భూనియా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగే అవకాశం కనిపించడం లేదని పేర్కొంటూ ఆయన తన రాజీనామా లేఖను మమతా బెనర్జీకి పంపారు.