నెలకు రూ.18.5 లక్షల అద్దె... అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ రెంట్ కు తీసుకున్న శ్రేయస్ అయ్యర్
- ముంబై వర్లీలో లగ్జరీ అపార్ట్మెంట్ లీజుకు తీసుకున్న శ్రేయస్ అయ్యర్
- మూడేళ్ల లీజు ఒప్పందం విలువ సుమారు రూ.7.14 కోట్లు
- మొదటి ఏడాది నెలకు రూ.18.5 లక్షల చొప్పున అద్దె చెల్లింపు
- ఈ డీల్తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్లు
భారత క్రికెటర్, టీ20 జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ ముంబైలో అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నాడు. నగరంలోని వర్లీ ప్రాంతంలో ఉన్న ఈ ఖరీదైన అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ కోసం మూడేళ్ల కాలానికి గాను ఏకంగా రూ.7.14 కోట్లతో లీజు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ముంబై రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ స్క్వేర్ యార్డ్స్ విశ్లేషించిన రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ లీజు ఒప్పందం 2026 జూన్ వరకు అమలులో ఉండనుంది. దీని ప్రకారం మొదటి ఏడాది నెలకు రూ.18.50 లక్షలు, రెండో ఏడాది రూ.19.79 లక్షలు, మూడో ఏడాది రూ.21.18 లక్షల చొప్పున అయ్యర్ అద్దె చెల్లించనున్నాడు. ఈ డీల్ కోసం ఆయన రూ.74 లక్షల సెక్యూరిటీ డిపాజిట్తో పాటు రూ.1.84 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం.
శ్రేయస్ అద్దెకు తీసుకున్న ఈ ఫ్లాట్ ప్రఖ్యాత 'ఆర్టేసియా రెసిడెన్షియల్' టవర్లో ఉంది. సుమారు 3,875 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్లను కూడా కేటాయించారు. ముంబైలోని అత్యంత సంపన్న నివాస ప్రాంతాల్లో ఒకటైన వర్లీ, బాంద్రా-వర్లీ సీ లింక్ ద్వారా నగరంలోని ప్రధాన ప్రాంతాలకు సులభంగా చేరుకునే సదుపాయం ఉండటంతో ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివసించేందుకు ఆసక్తి చూపుతుంటారు.
ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపికైన విషయం తెలిసిందే. కెప్టెన్గా ప్రమోషన్ పొందిన కొద్ది కాలంలోనే అయ్యర్ ఈ భారీ గృహ ఒప్పందం చేసుకోవడం గమనార్హం.
రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ స్క్వేర్ యార్డ్స్ విశ్లేషించిన రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ లీజు ఒప్పందం 2026 జూన్ వరకు అమలులో ఉండనుంది. దీని ప్రకారం మొదటి ఏడాది నెలకు రూ.18.50 లక్షలు, రెండో ఏడాది రూ.19.79 లక్షలు, మూడో ఏడాది రూ.21.18 లక్షల చొప్పున అయ్యర్ అద్దె చెల్లించనున్నాడు. ఈ డీల్ కోసం ఆయన రూ.74 లక్షల సెక్యూరిటీ డిపాజిట్తో పాటు రూ.1.84 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం.
శ్రేయస్ అద్దెకు తీసుకున్న ఈ ఫ్లాట్ ప్రఖ్యాత 'ఆర్టేసియా రెసిడెన్షియల్' టవర్లో ఉంది. సుమారు 3,875 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్లను కూడా కేటాయించారు. ముంబైలోని అత్యంత సంపన్న నివాస ప్రాంతాల్లో ఒకటైన వర్లీ, బాంద్రా-వర్లీ సీ లింక్ ద్వారా నగరంలోని ప్రధాన ప్రాంతాలకు సులభంగా చేరుకునే సదుపాయం ఉండటంతో ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివసించేందుకు ఆసక్తి చూపుతుంటారు.
ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపికైన విషయం తెలిసిందే. కెప్టెన్గా ప్రమోషన్ పొందిన కొద్ది కాలంలోనే అయ్యర్ ఈ భారీ గృహ ఒప్పందం చేసుకోవడం గమనార్హం.