అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్
- మైత్రివనం ప్రాంతంలో అగ్నిప్రమాదం
- తొలుత ఆటబొమ్మల దుకాణంలో మంటలు
- క్రమంగా కేఎస్ఆర్ కాంప్లెక్స్కు వ్యాప్తి
- ఎలాంటి ప్రాణనష్టం లేదని పోలీసుల వెల్లడి
- పొగ కమ్మేయడంతో నిలిచిపోయిన ట్రాఫిక్
మంటల ధాటికి ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున పొగ అలముకుంది. రోడ్డు కనపడనంత తీవ్రంగా పొగ కమ్మేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. మరోవైపు పోలీసులు ట్రాఫిక్ను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
మంటలు చెలరేగిన వెంటనే షాపింగ్ కాంప్లెక్స్లోని వారంతా బయటకు పరిగెత్తుకొచ్చారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. కానీ, చాలా దుకాణాలు దగ్ధం అవడంతో ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉండే అవకాశం ఉంది. అలాగే షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు సమీపంలోనే మెట్రో స్టేషన్లో కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం లేదని అధికారులు తెలిపారు. సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నట్లు చెప్పారు.