హర్మూజ్ జలసంధి మాదే.. అమెరికాతో చర్చలపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు
- అమెరికాతో ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదన్న ఇరాన్
- ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి కొనసాగుతోందని వెల్లడి
- హర్మూజ్ జలసంధి నిర్వహణ హక్కు తమదేనని స్పష్టీకరణ
- అణుబాంబు తయారుచేయకూడదని, నష్టపరిహారం లేదని షరతులు పెట్టిన ట్రంప్
- పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కొనసాగుతున్న శాంతి చర్చలు
అమెరికాతో ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదని, ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి ఇంకా కొనసాగుతోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. ఇరాన్తో ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని షరతులు విధించిన నేపథ్యంలో బఘాయీ ప్రభుత్వ టీవీ ఛానెల్తో ఫోన్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ "ఇరాన్ ఎప్పటికీ అణుబాంబును తయారు చేయబోమని అంగీకరించాలి" అని డిమాండ్ చేశారు. హర్మూజ్ జలసంధిని వెంటనే ఎలాంటి రుసుములు లేకుండా నౌకల రవాణాకు తెరవాలని, నీటిలో అమర్చిన మైన్లను తొలగించాలని షరతులు విధించారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికా, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) సమన్వయంతో స్వాధీనం చేసుకుని నాశనం చేస్తుందని తెలిపారు. ఇక ఇరాన్ డిమాండ్ చేస్తున్న యుద్ధ నష్టపరిహారంపై స్పందిస్తూ.. "తదుపరి నోటీసు వచ్చేవరకు ఎలాంటి డబ్బు మార్పిడి ఉండదు" అని ట్రంప్ తేల్చిచెప్పారు.
ట్రంప్ షరతులపై ఇరాన్ ప్రతినిధి బఘాయీ స్పందిస్తూ ప్రస్తుతం చర్చల్లో తమ ప్రధాన దృష్టి యుద్ధాన్ని ముగించడంపైనే ఉందని, యురేనియం శుద్ధి వంటి అంశాలపై చర్చించడం లేదని వివరించారు. హర్మూజ్ జలసంధి నిర్వహణ భవిష్యత్తు కేవలం ఇరాన్, ఒమన్లకు మాత్రమే సంబంధించిన విషయమని ఆయన గట్టిగా చెప్పారు.
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య 40 రోజుల పాటు జరిగిన పోరు తర్వాత ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరుపక్షాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అంతకుముందు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ "ఇరాన్ ఎప్పటికీ అణుబాంబును తయారు చేయబోమని అంగీకరించాలి" అని డిమాండ్ చేశారు. హర్మూజ్ జలసంధిని వెంటనే ఎలాంటి రుసుములు లేకుండా నౌకల రవాణాకు తెరవాలని, నీటిలో అమర్చిన మైన్లను తొలగించాలని షరతులు విధించారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికా, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) సమన్వయంతో స్వాధీనం చేసుకుని నాశనం చేస్తుందని తెలిపారు. ఇక ఇరాన్ డిమాండ్ చేస్తున్న యుద్ధ నష్టపరిహారంపై స్పందిస్తూ.. "తదుపరి నోటీసు వచ్చేవరకు ఎలాంటి డబ్బు మార్పిడి ఉండదు" అని ట్రంప్ తేల్చిచెప్పారు.
ట్రంప్ షరతులపై ఇరాన్ ప్రతినిధి బఘాయీ స్పందిస్తూ ప్రస్తుతం చర్చల్లో తమ ప్రధాన దృష్టి యుద్ధాన్ని ముగించడంపైనే ఉందని, యురేనియం శుద్ధి వంటి అంశాలపై చర్చించడం లేదని వివరించారు. హర్మూజ్ జలసంధి నిర్వహణ భవిష్యత్తు కేవలం ఇరాన్, ఒమన్లకు మాత్రమే సంబంధించిన విషయమని ఆయన గట్టిగా చెప్పారు.
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య 40 రోజుల పాటు జరిగిన పోరు తర్వాత ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరుపక్షాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.