కార్మికులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్‌.. కనీస వేతనాలు భారీగా పెంపు!

  • కేబినెట్ సబ్ కమిటీ నివేదికతో వేతనాల పెంపు
  • నాలుగు కేటగిరీలుగా కార్మికుల విభజన
  • వేతనాల లెక్కింపు కోసం మూడు జోన్ల ఏర్పాటు
  • హైస్కిల్డ్ కార్మికులకు గరిష్ఠంగా రూ.20 వేలు
  • జూన్ 1 నుంచి కొత్త జీతాల అమలు
తెలంగాణలోని కోట్లాది మంది కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. రాష్ట్రంలో కనీస వేతనాల పెంపునకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.11 కోట్ల మంది కార్మికులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.

మూడు జోన్లుగా విభజన
కార్మికుల కనీస వేతనాలను శాస్త్రీయంగా నిర్ణయించేందుకు వీలుగా మొత్తం రాష్ట్రాన్ని ప్రభుత్వం మూడు జోన్లుగా వర్గీకరించింది. ఇందులో జోన్-1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2 కింద మున్సిపాలిటీలు వస్తాయి. ఇక జోన్-3 కింద గ్రామీణ ప్రాంతాలను చేర్చారు. కార్మికులు నివసించే ప్రాంతాల ఆధారంగా ఈ వేతనాల పెంపు వర్తిస్తుంది.

కేటగిరీల వారీగా కొత్త జీతాలు
  • అన్‌స్కిల్డ్ (నైపుణ్యం లేనివారు): రూ.12,750 నుంచి రూ.16,000కు పెంపు.
  • సెమీ స్కిల్డ్ (పాక్షిక నైపుణ్యం): రూ.13,592 నుంచి రూ.17,000కు పెంపు.
  • స్కిల్డ్ (నైపుణ్యం ఉన్నవారు): రూ.13,772 నుంచి రూ.18,500కు పెంపు.
  • హై స్కిల్డ్ (అధిక నైపుణ్యం): రూ.14,607 నుంచి రూ.20,000కు పెంపు.
జూన్ 1 నుంచి అమలు
గత ప్రభుత్వ హయాంలో కనీస వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల కోట్లాది మంది కార్మికులు నష్టపోయారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేబినెట్ సబ్ కమిటీ అన్ని వర్గాలతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ సిఫార్సులు చేసిందని చెప్పారు. ఈ పెంచిన కొత్త వేతనాలన్నీ జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

Revanth Reddy
Telangana Labor
Minimum Wages
Telangana Government
Labor Wages Hike
Wage Increase
Telangana Workers
Revised Wages
Labor Welfare
June 1st

More Telugu News