ఐపీఎల్‌లో మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత

Mohammed Siraj Achieves Rare Feat in IPL
  • టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న సిరాజ్
  • కేకేఆర్‌తో మ్యాచ్‌లో రహానెను ఔట్ చేసి రికార్డ్
  • ఈ ఘనత సాధించిన 21వ భారత బౌలర్‌గా హైదరాబాదీ పేసర్
గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్, హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ తన కెరీర్‌లో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో టీ20 ఫార్మాట్‌లో 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ ఘనత సాధించాడు.

కేకేఆర్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో కెప్టెన్ అజింక్యా రహానెను ఔట్ చేయడం ద్వారా సిరాజ్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సిరాజ్ విసిరిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు రహానె (14) డిఫెన్స్ ఛేదించుకుని బంతి వికెట్లను గిరాటేసింది. ఈ వికెట్‌తో టీ20ల్లో 200 వికెట్లు పడగొట్టిన 21వ భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. తన 174వ టీ20 మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్న సిరాజ్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 121 మ్యాచ్‌లలో 123 వికెట్లు పడగొట్టాడు.

అయితే, సిరాజ్ వ్యక్తిగత రికార్డు సాధించిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (93) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో గుజరాత్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. అతడికి అండగా అంగ్‌క్రిష్ రఘువంశీ (82 నాటౌట్), కామెరాన్ గ్రీన్ (52 నాటౌట్) మెరుపు అర్ధశతకాలతో రాణించారు.

గుజరాత్ ఫీల్డర్లు రెండుసార్లు క్యాచ్‌లు వదిలిపెట్టడంతో అలెన్ మరింత రెచ్చిపోయాడు. రహానె ఔటయ్యాక, అలెన్-రఘువంశీ రెండో వికెట్‌కు 95 పరుగులు జోడించగా, ఆ తర్వాత రఘువంశీ-గ్రీన్ అజేయంగా మూడో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి కేకేఆర్‌కు భారీ స్కోరును అందించారు.
Go Back to Shorts
Mohammed Siraj
Siraj
IPL
T20 cricket
Kolkata Knight Riders
Gujarat Titans
Indian bowler
wicket record
Finn Allen
Angkrish Raghuvanshi

More Telugu News