ఆకివీడు రామాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్: పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు!
- గత 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉందన్న హైకోర్టు
- రికార్డులను పరిశీలించిన తర్వాతే ఆలయ నిర్మాణానికి అధికారులు అనుమతినిచ్చారని వెల్లడి
- రామాలయ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణంపై దాఖలైన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. ఆలయ నిర్మాణానికి అధికారులు ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం... ఆలయానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను సమర్థించింది.
గత 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉన్నట్లు రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయని న్యాయస్థానం పేర్కొంది. అధికారులు అన్ని రకాల ఆధారాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అధికారుల నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఆకివీడు రామాలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లయింది. భక్తులు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.